మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వినాయక మండపం వద్ద ఆడుకుంటున్న పదేళ్ల బాలుడు శ్రావణ్ గవాడే అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. కాస్త అలసటతో బాధపడుతున్నట్టుగా కనిపించిన శ్రావణ్, వెంటనే ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్నాడు.
ఇంతలోనే శ్రావణ్ పరిస్థితి మరింత విషమించడంతో గుండెపోటు వచ్చింది. తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచిన శ్రావణ్ కదలడం లేదని గమనించిన తల్లి తీవ్రంగా ఆందోళనకు లోనైంది. ఆమె బిగ్గరగా అరుస్తూ బయటకు పరుగెత్తింది.
చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే శ్రావణ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ల ప్రకారం, గుండెపోటుతో బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
తన కొడుకు అకాల మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి గుండెలవిసేలా విలపించగా, ఈ దృశ్యాన్ని చూశిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. చిన్న వయసులో గుండెపోటుతో బాలుడు మృతి చెందడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa