ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరియా సరఫరాలో ఉన్న సమస్యలని అధికారులు వెంటనే పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 02:51 PM

యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యను అధిగమించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యూరియా సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలని, అవసరమైతే టోకెన్‌ పద్ధతిలో పంపిణీ చేయాలని సూచించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, బాపట్ల, కడప, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిల్వలు ఎక్కువ ఉన్నచోట నుంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు యూరియా తరలించాలన్నారు. కాకినాడ, గంగవరం పోర్టుల నుంచి 53వేల టన్నుల యూరియా సమయానికి చేరుకునేలా పోర్టు, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa