ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయ వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 06:17 PM

దేశంలోని న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కోట్ల కొద్దీ కేసులకు పరిష్కారం చూపే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. చిన్నపాటి నేరాలు, భూ వివాదాలు వంటి సాధారణ కేసుల్లో తీర్పులను వేగవంతం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. 'రోబో జడ్జిలు'గా పిలుస్తున్న ఈ కొత్త విధానం, భారత న్యాయ వ్యవస్థ రూపురేఖలనే మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.'రోబో జడ్జి' అంటే న్యాయమూర్తి స్థానంలో ఒక రోబో కూర్చుని తీర్పులు చెప్పడం కాదు. కేసులకు సంబంధించిన సమాచారం, పాత రికార్డులు, గతంలో వెలువడిన తీర్పులు వంటి వాటిని ఏఐ టెక్నాలజీ వేగంగా విశ్లేషిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా న్యాయమూర్తులు త్వరితగతిన ఒక నిర్ణయానికి రావడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, చిన్నపాటి దొంగతనాలు, భూ తగాదాలు వంటి కేసుల విచారణలో ఈ విధానాన్ని ఉపయోగించనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం మానవ న్యాయమూర్తులను తొలగించడం కాదు, వారికి సహాయకారిగా ఉంటూ న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa