ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఘనత – ఫైనల్‌కు ఎంట్రీ

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 09:07 PM

సౌత్ కొరియా వేదికగా జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌–2025లో భారత ఆర్చర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్‌కు రెండు పతకాలు ఇప్పటికే ఖాయం అయ్యాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగే ఉన్న పురుషుల జట్టు ఫైనల్‌కు చేరి సంచలన విజయం నమోదు చేసింది.తొలి రౌండ్‌లో బై లభించిన భారత్‌ నేరుగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఈ దశలో ఆస్ట్రేలియా నుంచి గట్టి సవాలు ఎదురైంది. నిర్ణీత సమయానికి స్కోరు 232–232గా సమమవ్వడంతో షూట్‌–ఆఫ్ జరిగింది. ఆ కఠిన పోరులో భారత్‌ 30–28 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.క్వార్టర్ ఫైనల్లో యూఎస్‌పై భారత్ 234–233 తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. మ్యాచ్‌ ఆరంభంలో వెనుకబడి ఉన్నా చివరి దశలో భారత ఆర్చర్లు అసాధారణ ప్రదర్శన చేసి విజయం కైవసం చేసుకున్నారు.సెమీఫైనల్లో మూడో సీడ్ టర్కీని 234–232 తేడాతో ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది టీమిండియా. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఫ్రాన్స్‌తో తలపడనుంది. భారత్ ఫైనల్‌కి చేరడంలో రిషబ్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో 709 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రిషబ్‌, క్వార్టర్స్, సెమీస్‌లోనూ మెరిశాడు.అదేవిధంగా రిషబ్ యాదవ్, వెన్నం జ్యోతీ సురేఖ జోడీగా కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ భారత్‌కు ఫైనల్ బెర్త్ అందించారు. సెమీఫైనల్లో చైనీస్ తైపీపై 157–155 స్కోరుతో గెలిచి బంగారు పతక పోరులో అడుగుపెట్టారు. ఆదివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa