ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేశ్‌ నిమజ్జనంలో ప్రమాదం.. పైకి ఎత్తుతుండగా తెగిన క్రేన్

Crime |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 11:19 PM

9 రోజుల పాటు మండపాల్లో కొలువుదీరి.. భక్తుల చేత ఘనంగా పూజలు అందుకున్న గణపయ్య నేడు గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటున్నాడు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందడిగా సాగుతుంది. ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనానికి హుస్సేన్ సాగర్‌కి తరలి వచ్చాడు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు వేడుకగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. గణనాథుడిని నిమజ్జనం చేయడానికి పైకి ఎత్తుతుండగా.. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆ వివరాలు..


యాదాద్రి భువనగిరిలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 9 నెలల పాటు భక్తుల చేత పూజలు అందుకున్న గణపయ్యను ఘనంగా ఊరేగించిన అనంతరం నిమజ్జనం కోసం శుక్రవారం రాత్రి భువనగిరి చెరువు వద్దకు తీసుకొచ్చారు. ట్రాక్టర్‌లో ఉన్న గణపయ్యను నిమజ్జనం చేయడం కోసం.. క్రేన్‌ సహాయంతో వినాయకుడిని పైకి ఎత్తారు. ఈక్రమంలో ఒక్కసారిగా క్రేన్‌ తాడు తెగిపోయింది. దీంతో నిమజ్జనం కోసం పైకి ఎత్తిన గణేశుని విగ్రహం ట్రాక్టర్‌లోనే పడిపోయింది. ఈక్రమంలో ట్రాక్టర్‌లో కూర్చున్న ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


ఇదిలా ఉంటే.. ఖైరతాబాద్‌ బడా గణపతి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్ 4వ పాయింట్ వద్ద బడా గణపతిని నిమజ్జనం చేశారు. బడా గణపతి నిమజ్జనం కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య బడా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నారు. నిమజ్జనానికి ముందు బడా గణపతికి వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు చివరి పూజలు నిర్వహించారు. గురువారం అర్థరాత్రి 12 గంటల వరకే ఖైరతాబాద్ బడా గణపతి దర్శనానికి అనుమతించారు. ఆ తర్వాత భక్తులను రానివ్వలేదు. శుక్రవారం నాడు సీఎం రేవంత్ బడా గణపతిని దర్శించుకున్నారు.


సెప్టెంబ్ 6, శనివారం నాడు ఉదయం 7 గంటలకు బడా గణపతి శోభాయాత్ర ప్రారంభం అయ్యింది. రాజ్‌దూత్‌ సర్కిల్‌, ఖైరతాబాద్ గణపతి ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్దకు చేరుకున్నాడు. దీంతో అధికారులు గణేష్ శోభాయాత్ర మార్గంతోపాటుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లో కూడా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa