రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇద్దరూ సమావేశమయ్యారు.ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగిందని సమాచారం. ప్రధాని మోదీ జపాన్, చైనా పర్యటనల అనంతరం భేటీ కావడం ప్రత్యేకతను సంతరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ విదేశీ పర్యటన, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు, సుంకాలు విధింపు తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది. అలాగే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పంజాబ్లో ఆకస్మిక వరదలు సంభవించిన నేపథ్యంలో, వీటి గురించి కూడా భేటీలో చర్చ జరిగింది.చైనాలోని తియాంజిన్ వేదికలో జరిగిన SCO సమావేశంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో సమావేశమయ్యారు. అందులో పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరగగా, భారత సంబంధాలను బలపరిచే మార్గాలను కూడా పరిశీలించారు.అంతకుముందు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారం, ఉక్రెయిన్ వివాదం, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయ మార్పిడి జరిగింది. ప్రధాని మోదీ, ప్రపంచ శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa