ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది

national |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 10:51 AM

దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికులకు శుభవార్త చెబుతూ భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.పండగల సమయంలో సాధారణ రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ప్రయాణికుల తాకిడిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు పలు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, మధురై-బరౌని మధ్య 12, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-బరౌని మధ్య 12, షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య 10 రైళ్లు నడుస్తాయి.అదేవిధంగా, ఎస్‌ఎంవీటీ బెంగళూరు-బీదర్ మధ్య 9, తిరునెల్వేలి-శివమొగ్గ టౌన్ మధ్య 8 సర్వీసులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు తిరువనంతపురం నార్త్-సంత్రాగచి మధ్య 7, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-సంత్రాగచి మధ్య 3 రైళ్లు కూడా నడుస్తాయని అధికారులు వివరించారు. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టేషన్లు, టికెట్ లభ్యత వంటి పూర్తి వివరాల కోసం ప్రయాణికులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa