కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది అని వైసిపి నేత సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ... కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదు. వరి, పొగాకు, ఉల్లి, చీనీ, మామిడి, అరటి.. ఇలా రాష్ట్రమంతటా రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఉండటం లేదు. వైయస్ఆర్సీపీ దీనిపై నిరసనలు వ్యక్తం చేసి ప్రశ్నించినప్పుడు మాత్రం హడావుడిగా కేంద్రానికి లేఖ రాసేసి చేతులు దులిపేసుకుంటున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర పాలనలో ఏనాడూ రైతులను ఆదుకునే చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. వ్యవసాయాన్ని గాలికొదిలేసిందే కాకుండా యూరియా ఎక్కువ వాడితే కేన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి ఉచిత సలహాలిస్తున్నాడు. యూరియా కొరత గురించి ప్రశ్నిస్తేనే ఆయన ఇలాంటివన్నీ చెబుతుంటారు. ఇన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఇవన్నీ తన పాలసీలో ఎందుకు ప్రకటించలేదు? బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ ని ఫేక్ పార్టీ అని, తొక్కి పడేస్తా అని బెదిరిస్తున్నాడు. చరిత్రలో నియంతలు కూడా ప్రజా సమస్యల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించి ఉండరు. ప్రజల నుంచి నేరుగా అధికారం తెచ్చుకుని ఉంటే ఆయనకివన్నీ తెలుస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక పార్టీ మీద ఆధారపడి, లేదా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వస్తున్నాడు కాబట్టే ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, బాధ్యత చంద్రబాబుకి లేదు. కాబట్టే ఆయనకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa