ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిక్క‌ర్ స్కాం అంటూ కూటమి చెప్తున్న భేతాళ కథలకి ముగింపు వచ్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 04:18 PM

ఏపీ లిక్క‌ర్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి, భార‌తీ సిమెంట్స్ డైరెక్ట‌ర్ బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్ట్‌ చేయగా ఆయన 117 రోజులుగా జైల్లో ఉన్నారు. మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్‌ అరెస్ట్‌ చేయగా 113 రోజులుగా జైల్లో ఉన్నారు.ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి  మాట్లాడుతూ...  ‘‘సిట్ భేతాల కథలు ఇక చెల్లవు. కోర్టులో న్యాయమే జరుగుతుంది.లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేక పోయింది. కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మనోహర్‌రెడ్డి అన్నారు.బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈ రోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్‌రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa