ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య కళాశాలలపై చంద్రబాబు అందుకే కుట్రపన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 04:19 PM

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటీకరణ చేయడం ద్వారా.. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ అంటే దివంగత నేత వైయ‌స్ఆర్ మాత్రమే గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో చేపట్టిన నాడు-నేడు, నూతన వైద్య కాలేజీల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో చిరస్ధాయిగా నిల్చిపోతుందని స్పష్టం చేసారు.  ప్రజల్లో ఆ మంచి పేరును చెరిపివేయాలన్న కుట్రతో పాటు, ఇన్సూరెన్స్ పేరుతో తమ వారికి కట్టబెట్టడానికే... కూటమి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పాల్పడుతోందని మండిపడ్డారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa