ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని చినవెంకన్న దేవస్థానంలో 2017 జనవరి 17 నుంచి 2025 జూలై 17 నాటికి రూ.88.17 లక్షల విలువైన పాత కరెన్సీ ఉన్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయ స్ట్రాంగ్ రూమ్లో, రద్దయిన వెయ్యి నోట్లు 2,873, రద్దయిన రూ.500 నోట్లు 11,888 ఉన్నట్లు వారు వివరించారు. రద్దయిన రూ.2000 నోట్లు కూడా ఉన్నా వాటిని మార్చుకునే అవకాశం ఇంకా ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. హుండీల ద్వారా రూ.2 వేల నోట్లు వంద వరకు వచ్చిన వెంటనే వాటిని హైదరాబాద్, రిజర్వ్ బ్యాంకులో మారుస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా, గత నెల 17న నిర్వహించిన హుండీల లెక్కింపులో సైతం 14.. 2000 నోట్లు మినహాయిస్తే, పాత రూ.500 నోట్లు 15, రూ.1000లు 12 నోట్లు వచ్చాయి. ఇంకా తమ వద్ద ఉన్న ఇలాంటి నోట్లను పాడేయడం ఇష్టం లేకే... సదరు భక్తులు విలువలేని నోట్లను మొక్కుబడుల పేరుతో హుండీల్లో వేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని ఇలా మూటలు కట్టి దాయడం తప్ప ఏమీ చేయలేమని అధికారులు పెదవి విరుస్తున్నారు. విలువలేని కరెన్సీ నోట్ల పరిస్థితి ఇలా ఉంటే... విలువ ఉన్న చిల్లర నాణేలు సైతం పలు కారణాలతో బ్యాంకుల్లో మూలుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa