ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీబీ కోర్టు నిర్ణయంపై హైకోర్టుని ఆశ్రయించిన ఏసీబీ, నేడు విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 08:26 AM

మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ శనివారం విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అదే రోజు రాత్రి సీఐడీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు అత్యవసరంగా మూడు వేర్వేరు హౌస్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు చేసింది. నిందితుల పాత్రపై సీఐడీ అధికారులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని.. నేర ఘటనలో ఇమిడి ఉన్న మొత్తం సొమ్ము స్వాధీనం చేసుకోలేదనే కారణంతో బెయిల్‌ మంజూరు చేయడం సరికాదని పేర్కొంది. ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. సీఐడీ పిటిషన్ల గురించి శనివారం రాత్రి రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌).. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వాటిపై సోమవారం సంబంధిత బెంచ్‌ విచారణ జరిపేందుకు అనుమతిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa