ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల సమస్యలని తెలియజెయ్యడం కూడా నేరమేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 12:42 PM

యూరియ ఎరువుల కొరతతో రైతులు ఎదురుకొంటున్న సమస్యల పై వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు ఆర్డీఓ లకు వినతిపత్రం అందజేయనున్నాం అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అయన మాట్లాడుతూ.... శాంతియుతంగా ర్యాలీ చేసి ఆర్డీఓ లకు రైతులతో, పార్టీ నేతలతో కలిసి రైతుల సమస్యల పై వినతిపత్రం అందజేస్తాం. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అనగా తొక్కాలని చూస్తుంది. యూరియ ఎరువుల కొరత లేకుంటే ఎందుకు కూటమి ప్రభుత్వం బయపడుతుంది . వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఇళ్ల ముందు పోలీసులను పెట్టి ఎందుకు నిర్భందిస్తున్నారు. రైతులు ఎందుకు రాత్రింబ‌గలు లైన్లలో నిలబడి ఇబ్బంది పడుతున్నారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూ యూరియ తేవడంలో కూటమి విఫలమైంది. ఎంత మంది పోలీసులను పెట్టిన ఈ రోజు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీరుతాం అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa