ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వంలో రాష్టం రావణకాష్టం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 12:49 PM

మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును గుంటూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. ఈ సందర్బంగా  నంబూరు శంకరరావు  మాట్లాడుతూ.. రైతు సమస్యలపై వినతిపత్రం అందజేయడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్టం రావణకాష్టం అయ్యిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఎండలో పడికాపులు కాస్తున్నారన్నారు. వారి సమస్యను ప్రభుత్వం తీసుకొని వెళ్లేందుకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రివర్యులు వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాలు మేరకు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్యకర్తలను నిర్బంధించ‌డం స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతులు, ప్రజలు పడుతున్న సమస్యలపై వై యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని నంబూరు శంకరరావు హెచ్చ‌రించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa