ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ ఘన విజయాన్ని సాధించారు. దీంతో ఆయన 15వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన పూర్తిపేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. తమిళనాడులోని తిరుప్పూర్లో మే 4, 1957న జన్మించిన ఆయన, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో స్వయంసేవక్గా పనిచేయడం ప్రారంభించిన ఆయన, 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa