ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏనుగుతో సెల్ఫీకి ప్రయత్నించిన వ్యక్తికీ జరిమాన

national |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 01:02 PM

కర్ణాటక రాష్ట్రంలోని బండీపుర జాతీయ పార్కులో వింత  ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పర్యాటకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రమాదకరంగా ఏనుగుకు మరీ దగ్గరగా వెళ్లాడు. దీంతో  ఏనుగు అతడిని వెంబడించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ అధికారులు స్పందించారు. ఆ పర్యాటకుడిని గుర్తించి, వన్యప్రాణుల భద్రతకు ముప్పు కలిగించినందుకు రూ. 25,000 జరిమానా విధించారు. బండీపురలో ఏనుగులు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతాయని, పర్యాటకులు వాటికి సురక్షితమైన దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa