ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, కర్ణాటక రాజకీయాలలో వాడివేడి

national |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 01:47 PM

కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జి.పరమేశ్వర... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ విద్యార్థి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం వివాదానికి దారితీసింది. ఇది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు కారణమైంది.తుమకూరు జిల్లా తిప్టూరులో ఏబీవీపీ స్థానిక శాఖ ‘రాణి అబ్బక్క రథయాత్ర’, ‘పంజిన పరేడ్’ (కాగడాల ప్రదర్శన) కార్యక్రమాలను నిర్వహించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమాన్ని హోంమంత్రి పరమేశ్వర స్వయంగా ప్రారంభించారు. సాధారణంగా బీజేపీ, దాని సైద్ధాంతిక మాతృక అయిన ఆర్ఎస్ఎస్‌పై, వాటి అనుబంధ సంస్థలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. మతతత్వ విభజనను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తుంటారు. అలాంటిది, స్వయంగా హోంమంత్రే ఏబీవీపీ వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.పరమేశ్వర చర్య తన పార్టీ సిద్ధాంతాలకు, ప్రకటించిన విధానాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని, ఇది ఏబీవీపీకి పరోక్షంగా మద్దతు తెలపడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఇది గందరగోళానికి దారితీస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa