భీమవరం అతిథి మర్యాదలకు పేరుపొంది, పక్క రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు పొందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శుక్రవారం అన్నారు. ప్రధానమంత్రి మోదీ స్ఫూర్తితో సారథ్యం యాత్ర నిర్వహిస్తున్నామని, చాయ్ పే చర్చ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యమన్నారు. జీఎస్టీ శ్లాబ్ రేట్ల సరళీకరణతో మధ్యతరగతికి ఊరట, చిన్న వ్యాపారులకు లాభంగా మారిందని అన్నారు. ఇంధన ధరలు పెరుగుతున్న వేళ, ప్రధాని ధరల నియంత్రణ నిర్ణయం అభినందనీయం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. చాయ్ పే చర్చ కార్యక్రామాన్ని శుక్రవారం భీమవరంలో నిర్వహించగా, కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa