ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూ మతాన్ని వాడుకునే మీరు హిందూ ఆలయాలకు చేసింది ఇది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 12:25 PM

హిందూ మ‌తం ముసుగులో వైయ‌స్ఆర్‌సీపీపై విష ప్ర‌చారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు. కూట‌మి నేత‌లు చేస్తున్న మ‌త రాజ‌కీయాల‌ను ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.అయన మాట్లాడుతూ.... ఇటీవల ఒకే పోస్టును ఏపీ బీజేపీ రాష్ట్ర‌ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి  ట్వీట్ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీపై హిందూ మతం ముసుగులో విషం చిమ్మేందుకు కూట‌మి నేత‌లు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు ఆఫీస్ నుంచి వచ్చిన ట్వీట్లు పోస్టు చేయ‌డ‌మే బీజేపీ నేత‌ల ప‌ని. రఘురాముడి తలను ధ్వంసం చేసింది మీ కూటమి పార్టీ సభ్యుడే. మరి అతన్ని  మీరు ఎలా మర్చిపోయారు. ట్వీటు చేయ‌మ‌ని మీకు చంద్ర‌బాబు స్క్రిప్ట్ రాసివ్వలేదా?. అంతర్వేది రథం ధ్వంసం చేసింది ఎవరో తేల్చమని మేం సీబీఐని ఆనాడే కోరాం. ఇప్పుడు అధికారంలో ఉన్న‌ది మీ ప్ర‌భుత్వ‌మే క‌దా?  నిందితుల‌ను ప‌ట్టుకోండి . అంతర్వేది రథాన్ని పునఃనిర్మాణం చేసి స్వామివారికి అంకితం చేసిన ఘనత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిది. తాడేపల్లి గూడెంలోని పెంటరాడులోని ఆలయంలో రథాన్ని ధ్వంసం చేసింది మర్చిపోదామా?. టీడీపీ, బీజేపీ కలిసి చేసిన విధ్వంసాన్ని మర్చిపోదామా?. తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని మర్చిపోదామా?. తిరుచానూరులో వారాహి అమ్మవారి విగ్ర‌హాన్ని ధ్వంసం చేసింది మర్చిపోయారా?. ఏపీలో అత్యధికంగా ఆలయాలు ధ్వంసమైనా, గుడులు కూల్చేసినా టిడిపి,బీజెపి కలిసి ఉన్నప్పుడే . పుష్కరాల్లో ఏం జరిగిందో మర్చిపోయారా?. మళ్లీ పుష్కరాలొస్తున్నాయి గతాన్ని మర్చిపోదామా?. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడం వల్ల భక్తులు మరణించారు మర్చిపోదామా?. తిరుమలలో తొక్కిసలాటలో అశువులు బాసిన వారిని మర్చిపోదామా?. టిడిపి,బీజేపి కలిసి కూల్చేసిన కాశీనాయని ఆశ్రమాన్ని మర్చిపోదామా? అని సూటిగా ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa