పదిహేను నెలల్లో ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయ్యిందని వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అంటూ నిర్వహించిన విజయోత్సవ సభలో ఆత్మస్తుతి - పరనింద తప్ప మరొకటి ఉందా అని ప్రశ్నించారు. ఈ సభ ద్వారా పచ్చి అబద్దాలను మాట్లాడుతూ, తన మాటలకు చప్పట్లు కొట్టాలంటూ ప్రజలను పదేపదే వేడుకున్న సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ... విజయోత్సవ సభ కోసం అనంతపురం జిల్లా యంత్రాంగం మొత్తం కంట్రోల్ రూంలు సైతం ఏర్పాటు చేసి, ఒక రాజకీయ పార్టీ సభ కోసం ఏర్పాట్లలో మునిగిపోయింది. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్తో పాటు 140 హామీలను ఇచ్చారు. సూపర్ సిక్స్ను పూర్తిగా అమలు చేశామని, అందుకే ఈ సభను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిజంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి ఉంటే, దాదాపు 11 సార్లు సీఎంగా తన మాటలకు చప్పట్లు కొట్టాలని, ఆహా.. ఓహో అనాలని, నిజమా? కాదా? అని చెప్పాలని ప్రజలను ఎందుకు వేడుకోవాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్పాలి. ఏ సీఎం ఇన్ని సార్లు చప్పట్లు కొట్టాలని ప్రజలను వేడుకోవడం చూడలేదు. అరకొరగా హామీలను అమలు చేసి, మొత్తం సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేశాం, ప్రజలు సంతోషంగా ఉన్నట్లుగా సిగ్గులేకుండా చెప్పుకున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి, మీ పథకాలుగా ప్రచారం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక్క కొత్త పథకాన్ని అయినా ప్రజలకు అందించారా? అని సూటిగా ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa