పిల్లలు విరేచనాలతో ఇబ్బంది పడడం సహజమని, దానికి సాధారణ చికిత్స సరిపోతుందని నిపుణులు తెలిపారు. అయితే, విరేచనాలు వెంటనే తగ్గాలనే తల్లిదండ్రుల ఆత్రుత కారణంగా వైద్యులు అవసరం లేకపోయినా యాంటీబయాటిక్ మందులు రాస్తున్నారని, వాటిని ఉపయోగించడం వల్ల విరోచనాలు వెంటనే తగ్గిపోతాయని చెప్పారు. తాత్కాలికంగా సత్ఫలితాన్నిచ్చే ఈ మందుల వల్ల దీర్ఘకాలంలో చేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ మందులు ఎక్కువగా వాడడం వల్ల పిల్లల్లో యాంటీమైక్రోబియాల్ నిరోధకత పెరిగి అనర్థాలకు దారితీస్తుందని చెప్పారు. ఈ విషయంలో వైద్యులను తప్పుపట్టేందుకు లేదని, తమ పిల్లలకు త్వరగా నయం కావాలని ఆలోచించే తల్లిదండ్రులదే తప్పని అన్నారు. యాంటీబయాటిక్ మందుల వాడకంపై అపోహలు, అవసరం లేకున్నా వాడితే కలిగే అనర్థాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa