ప్రముఖ స్టాండప్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నుంచి గట్టి హెచ్చరిక ఎదురైంది. ఆయన హోస్ట్ చేస్తున్న 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో ముంబై నగరాన్ని 'బాంబే' లేదా 'బంబై' అని పదేపదే సంబోధించడంపై ఎంఎన్ఎస్ నేత అమేయ ఖోప్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలా పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ఈ షో తాజా ఎపిసోడ్కు నటీమణులు హుమా ఖురేషి, శిల్పా శెట్టి, షమితా శెట్టి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హుమా ఖురేషి ముంబై నగరాన్ని 'బాంబే' అని ప్రస్తావించారు. ఈ ఘటనపై అమేయ ఖోప్కర్ సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా స్పందించారు. "దాదాపు 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్న కపిల్ శర్మకు నగరం పేరును సరిగ్గా పలకడం కూడా రావడం లేదు. బయటి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ మన నగరాన్ని అవమానిస్తున్నారు" అని ఆయన మండిపడ్డారు.ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, "కపిల్ శర్మ పేరును మేము 'తపిల్' అని పిలిస్తే ఆయనకు అంగీకారమేనా? ముంబై అనేది కేవలం ఒక పేరు కాదు, అది మా అస్తిత్వం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే, భవిష్యత్తులో మా నిరసనలు చూడాల్సి చవి వస్తుంది" అని ఖోప్కర్ గట్టిగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa