ట్రెండింగ్
Epaper    English    தமிழ்

355 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 108 పాయింట్ల లాభంతో నిఫ్టీ

business |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 08:22 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు కూడా లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో మార్కెట్లు మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 355.97 పాయింట్లు పెరిగి 81,904.70 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 108.50 పాయింట్లు లాభపడి 25,114.0 వద్ద ముగిసింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీనికి తోడు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా ప్రతిపాదించిన టారిఫ్‌లను యూరోపియన్ యూనియన్ తిరస్కరించవచ్చని వస్తున్న నివేదికలు కూడా మార్కెట్‌కు కలిసొచ్చాయని విశ్లేషకులు పేర్కొన్నారు.అంతేకాకుండా, భారత ప్రభుత్వం ఆరు కొత్త తరం జలాంతర్గాముల కొనుగోలు కోసం చర్చలు ప్రారంభించడంతో రక్షణ రంగ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ లో బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టీ, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ షేర్లు ప్రధానంగా లాభపడగా.. హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.మరోవైపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పుంజుకుంది. రూపాయి 0.18 శాతం బలపడి 88.27 వద్ద ముగిసింది. డాలర్ ఇండెక్స్ 98 స్థాయికి దిగువన బలహీనంగా ఉండటం, అమెరికాతో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగడం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలు రూపాయికి అండగా నిలిచాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన జతీన్ త్రివేది తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa