సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా జరుగుతోన్న నేపాల్ హింసాత్మక ఆందోళనల్లో భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయారు. కాఠ్మాండూలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మహిళ బస చేసిన హోటల్కు నిరసకారులు నిప్పంటించడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆమె మృతిచెందారు. ఘజియాబాద్కు చెందిన రాజేశ్ గోలా (57), ఆమె భర్త రామ్వీర్ సింగ్ గోలా సెప్టెంబరు 7న నేపాల్కు వెళ్లారు. కాఠ్మాండూలోని హయతత్ రీజెన్సీలో ఈ దంపతులు చెక్ ఇన్ అయ్యారు. మంగళవారం (సెప్టెంబరు 9న) జెన్ జీ ఆందోళనకారులు.. వారు బసచేసిన హోటల్కు నిప్పంటించడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు.
చుట్టూ మంటలు వ్యాపించి మెట్ల ద్వారా కిందకు దిగేందుకు అవకాశం లేకపోవడంతో రామ్వీర్, రాజేశ్లు నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకారు. కిందనున్నవారు పరుపులు వేసి.. కిటికిలో నుంచి దూకాలని సూచించారు. దీంతో ఇరువురూ పై నుంచి దూకేయగా.. రామ్వీర్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన భార్య మాత్రం తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్ గోలా మృతి చెందారు. ఇక, మంత్రులను వీధుల్లో పరుగెత్తించి పరుగెత్తించి కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్ాయయి.
రాజేశ్ గోలా కుమారుడు విశాల్ మాట్లాడుతూ... ఆందోళనకారులు నిప్పంటించడంతో తప్పించుకునే క్రమంలో తన తల్లి ప్రాణాలు కోల్పోయారని కన్నీటిపర్యంతమయ్యారు. మంటల నుంచి తప్పించుకునే సమయంలో నాన్న నుంచి వేరుపడటంతో అమ్మ చనిపోయిందని అన్నారు. ఒకవేళ నాన్నతో గనుక ఉండుంటే ఆమె బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ యువత చేపట్టిన జెన్ జి ఆందోళనలు .. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన సంగతి తెలిసిందే. ఆవేశంతో రగలిపోయిన యువతరం.. అమానుష చర్యలకు తెగబడింది. మంత్రులను ఉరికించి ఉరికించి దాడిచేశారు. పార్లమెంట్, అధ్యక్ష భవనం, ప్రధాన మంత్రి వ్యక్తిగత నివాసం, మంత్రుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రభుత్వ ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో 25 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు.
యువత ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీనికి ముందే ఆయన క్యాబినెట్లోని మంత్రులంతా తప్పుకున్నారు. కల్లలో పరిస్థితులు నెలకొనడంతో నేపాల్ మొత్తాన్ని సైన్యం తన అధీనంలోకి తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. తొలుత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి పేరు వినిపించగా.. తర్వాత ఇంజినీర్ కుల్మన్ ఘీషింగ్ తెరపైకి వచ్చారు. ఈ క్రమంలో అధ్యక్షుడు రామచంద్ర పౌడల్, జె జి ఆందోళనకారులకు మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa