అనకాపల్లి జిల్లో ఓ బ్రిడ్జి కూలి నెల రోజులైనా కూటమి ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చోడవరం నియోజకవర్గంలో కూలిన బ్రిడ్జిని శుక్రవారం వైయస్ఆర్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, విజయరామరాజు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేసిందని అమర్నాథ్ ధ్వజమెత్తారు. వంతెన కూలి ప్రజలు అవస్థలు పడుతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. కూటమి ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టడమే కనిపిస్తుంది కానీ, పని మాత్రం మొదలుపెట్టడం లేదని విమర్శించారు. వారి వెంట బుచ్చయపేట జడ్పీటీసీ దొండ రాంబాబు, వైస్ ఎంపీపీ దొండ నారాయణమూర్తి, మండలం పార్టీ అధ్యక్షుడు కొలిమల్ల అచ్చెంనాయుడు, జోగా కొండబాబు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa