ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జంక్ ఫుడ్ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త

Life style |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 02:33 PM

చీజ్‌బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారా? అయితే జాగ్రత్త! కేవలం నాలుగంటే నాలుగు రోజులు ఇలాంటి ఆహారం తీసుకుంటే చాలు.. మీ మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు పెరగడం లేదా మధుమేహం వంటి సమస్యలు రాకముందే, మెదడు పనితీరు దెబ్బతినడం మొదలవుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (యూఎన్‌సీ) శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ 'న్యూరాన్‌'లో ప్రచురితమయ్యాయి. అధిక కొవ్వు పదార్థాలున్న ఆహారం (హై-ఫ్యాట్ డైట్) తీసుకున్నప్పుడు, మెదడుకు గ్లూకోజ్ (చక్కెర) అందే ప్రక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల మెదడులోని జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్‌లో ఉండే 'సీసీకే ఇంటర్‌న్యూరాన్లు' అనే ప్రత్యేక కణాలు అతిగా చురుకుగా మారుతున్నాయి. ఈ మార్పు కారణంగానే జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ అధ్యయనం కోసం ఎలుకలపై ప్రయోగాలు చేశారు. వాటికి నాలుగు రోజుల పాటు అధిక కొవ్వు ఉండే ఆహారాన్ని అందించిన తర్వాత వాటి ప్రవర్తనను పరీక్షించారు. కేవలం కొద్ది రోజుల్లోనే వాటి మెదడు కణాల్లో అనూహ్యమైన మార్పులు, జ్ఞాపకశక్తిలో లోపాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు."ఆహారం, జీవక్రియ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని మాకు తెలుసు. కానీ, హిప్పోక్యాంపస్‌లోని సీసీకే ఇంటర్‌న్యూరాన్లు అనే ప్రత్యేక కణాలు ఇంత సున్నితంగా ఉంటాయని, కొద్ది రోజుల ఫ్యాటీ ఫుడ్‌కే ఇంతలా దెబ్బతింటాయని ఊహించలేదు" అని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జువాన్ సాంగ్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa