బ్రిటన్లో భారత సంతతి ప్రజలపై జాత్యహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఓల్డ్బరీ పట్టణంలో ఇరవై ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడి, జాతి వివక్ష వ్యాఖ్యలతో అవమానించిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. "మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి" అంటూ ఆమెపై దుండగులు అరిచినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఈ దాడితో బ్రిటన్లోని భారత సంతతి సమాజం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది.గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఓల్డ్బరీలోని టేమ్ రోడ్ సమీపంలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనను సాధారణ నేరంగా కాకుండా 'జాత్యహంకార ప్రేరేపిత దాడి'గా పరిగణించి దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు శ్వేతజాతీయులని, వారిలో ఒకరు గుండుతో ముదురు రంగు స్వెట్షర్ట్ ధరించి ఉండగా, మరొకరు గ్రే కలర్ టాప్ వేసుకున్నారని పోలీసులు తెలిపారు.ఈ దాడిపై స్థానిక సిక్కు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆందోళన అర్థం చేసుకోగలమని చెప్పిన ఓ సీనియర్ పోలీస్ అధికారి, ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచుతామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa