ఏపీ రాజధాని విషయంలో వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నం వెళ్లే ఆలోచన లేదని, అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిన్న మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితో కలిసి సజ్జల ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడానికి గల కారణాలను సజ్జల వివరించారు. "అమరావతి నిర్మాణానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చంద్రబాబే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో భారం మోయలేదనే ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారు. అందులో అమరావతి కూడా ఒకటి" అని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి ఉంటే జగన్ తప్పకుండా విశాఖ నుంచే పాలించేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఈ విషయంపై ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో జగనే స్వయంగా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa