భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన నియమాలను ఉల్లంఘించిన కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఫిన్టెక్ రంగంలో ప్రముఖంగా ఉన్న ఫోన్పే లిమిటెడ్పై RBI భారీ జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఫోన్పే లిమిటెడ్ సంస్థపై ₹21 లక్షల జరిమానాను విధించినట్టు RBI స్పష్టం చేసింది. అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 మధ్యకాలంలో ఫోన్పే కార్యకలాపాలపై RBI చట్టబద్ధంగా తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీల్లో కొన్ని అనియమాలు వెలుగులోకి రావడంతో జరిమానా విధించామని పేర్కొంది.
తనిఖీల సమయంలో ఫోన్పే సంస్థ RBI ఆదేశాలను సరిగా పాటించకపోవడమే కాకుండా, సంబంధిత అధికారులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు పేర్కొంది. దీనిని సంస్థకు ముందు జాగ్రత్తగా పంపిన నోటీసు ద్వారా తెలిపి, సంస్థ అభిప్రాయాలు స్వీకరించిన తరువాతే జరిమానా నిర్ణయించినట్టు RBI వివరించింది.
ఈ చర్యతో ఫిన్టెక్ సంస్థలకు స్పష్టమైన హెచ్చరికగా RBI సందేశం ఇచ్చింది. నిబంధనలు, మార్గదర్శకాలను పాటించకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా కూడా మినహాయింపు ఉండదని ఈ ఘటన సూచిస్తోంది. పేమెంట్ వ్యవస్థల నమ్మకాన్ని కాపాడేందుకు RBI కఠిన చర్యలు తీసుకోవడం భవిష్యత్లో మరిన్ని సంస్థలను జాగ్రత్తగా వ్యవహరించేందుకు ప్రేరేపించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa