ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలస్తీనా ప్రత్యేక దేశం.. సంపూర్ణ మద్దతు తెలపిన ఇండియా

international |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 09:45 PM

పాలస్తీనా కు ప్రత్యేక దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ.. ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సభ చేసిన తీర్మానికి భారత్ మద్దతు తెలిపింది. శుక్రవారం నాడు జరిగిన ఓటింగ్‌లో భారత్ ఈ తీర్మానికి అనుకూలంగా ఓటేసింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య శాంతియుత పరిష్కారం కోసం.. ‘రెండు దేశాల పరిష్కార మార్గం(టూ నేషన్ ఫార్ములా)’ అమలుపై.. న్యూయార్క్‌ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపే తీర్మానానికి.. అనుకూలంగా ఇండియా ఓటు వేసింది. ఈ తీర్మానాన్ని ఫ్రాన్స్ ప్రవేశపెట్టింది.


అయితే ఈ తీర్మానానికి అనూహ్యంగా భారత్ సహా మరో 142 దేశాల మద్దతు లభించింది. 10 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 12 దేశాలు ఓటింగ్‍కు దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానానికి గల్ఫ్ దేశాలన్నీ మద్దతు తెలిపాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్, పలావు, పపువా న్యూ గినియా, టోంగా, అర్జెంటీనా, హంగరీ, నౌరు, పరాగ్వే మైక్రోనేషియాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.


ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గాజా విషయంలో ఇండియా తన వైఖరిని మార్చుకుంది. గత మూడు సంవత్సరాలలో కాల్పుల విరమణకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన తీర్మానాలపై నాలుగు సార్లు ఓటింగ్ నిర్వహించగా.. భారత్ దీనికి దూరంగా ఉంది. దీంతో ఇండియా తీరుపై మీద విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో ప్రస్తుతం ప్రవేశపెట్టిన తీర్మానికి ఇండియా సంపూర్ణ మద్దతు తెలిపింది


డిక్లరేషన్‍లో ఇజ్రాయెల్ చర్యలను తప్పుబట్టారు. ఏడు పేజీల డిక్లరేషన్‍లో అనేక అంశాలు ప్రస్తావించారు. గాజాలో యుద్ధాన్ని ఆపడానికి, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యను రెండు దేశాల పరిష్కారంతో శాంతియుతంగా పరిష్కరించడానికి, పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలు, ప్రాంతంలోని ప్రజలందరికీ మంచి భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పనిచేస్తామని నాయకులు అంగీకరించారు. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‍పై దాడి చేసింది. ఈ దాడిలో 1,200 మంది చనిపోయారు. 250 మందిని బందీలుగా తీసుకున్నారు. డిక్లరేషన్‌లో ఈ దాడిని ఖండించారు.


ఇజ్రాయెల్ గాజాలో చేసిన దాడులను కూడా విమర్శించారు. ఈ దాడుల వల్ల పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు, అమాయకులు చనిపోయారని, ఆస్తులు ధ్వంసం అయ్యాయని, ప్రజలకు ఆహారం అందకుండా చేశారని విమర్శించారు. దీనివల్ల అక్కడ మానవతా సంక్షోభం ఏర్పడిందని తెలిపారు.ఇజ్రాయెల్ నాయకులు రెండు దేశాల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని డిక్లరేషన్‍లో కోరారు. పాలస్తీనాకు ఒక స్వతంత్ర దేశం గుర్తించాలని తెలిపారు. అలానే.. ఇజ్రాయెల్ పాలస్తీనియన్లపై హింసను ఆపాలని, ఆక్రమిత ప్రాంతాలలో స్థావరాల నిర్మాణం, భూములను లాక్కోవడం ఆపాలని, ఆక్రమణ ప్రాజెక్టులను వదిలేయాలని డిక్లరేషన్‍లో కోరారు. స్థానికులపై హింసను కూడా ఆపాలని సూచించారు.


అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడమే కాక ఘాటు విమర్శలు చేసిది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక రాజకీయ సర్కస్‍లా మారింది. దీనికి వాస్తవంతో సంబంధం లేదు. ఈ తీర్మానంలో హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఒక్కసారి కూడా చెప్పలేదు అంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓరెన్ మార్మోర్‌స్టీన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa