రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 50 శాతం టారిఫ్లను విధించడం అంత సులభమైన విషయం కాదని.. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రష్యాకు భారత్ అతిపెద్ద కస్టమర్గా ఉంది. వారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున నేను భారత్పై 50 శాతం టారిఫ్ విధించాను. ఇది చేయడం అంత సులభం కాదు. ఇది చాలా పెద్ద విషయం. ఇది భారత్తో సంబంధాల్లో సమస్యలు తీసుకువస్తుంది" అని శుక్రవారం ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై కఠినంగా వ్యవహరించడం అంటే ఏమిటని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ సమాధానం ఇచ్చారు.
అంతేకాకుండా తాను ఇప్పటికే చాలా చేశానని ట్రంప్ అన్నారు. ఇది తమ కంటే యూరప్కే ఎక్కువ సమస్య అని కూడా ఆయనన వివరించారు. తాను రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచంలోని అనేక సమస్యలను పరిష్కరించానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాను ఏడు యుద్ధాలను ఆపానన్నారు. వాటిలో పాకిస్థాన్-భారతదేశం మధ్య సమస్య కూడా ఉందిని పునరుద్ఘాటించారు. కొన్ని సమస్యలు పరిష్కరించడానికి అసాధ్యమైనవని.. అలాంటి వాటిలోనే కాంగో, రువాండా ఉన్నాయని అన్నారు. కానీ తాను వాటిని కూడా పరిష్కరించానని తెలిపారు. ఇవి 31 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని.. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇలా తాను అసాధ్యమైన యుద్ధాలను పరిష్కరించాను పరిష్కరించానని స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును తన జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ పరిపాలనలో భారత్కు అమెరికా తదుపరి రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్.. తన అధికార పరిధిలో వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లోని మధ్యతరగతి జనాభా అమెరికా జనాభా కంటే ఎక్కువని చెప్పుకొచ్చారు. అమెరికా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్జీ కోసం భారత మార్కెట్ తెరవాలని మేము కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయని పేర్కొన్నారు.
అయితే అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాత్రం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపితేనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని చెప్పారు. తాము భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతామన్నారు. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపితేనే ఈ పురోగతి సాధ్యమవుతుందని లుట్నిక్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చూడాలి మరి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు ఎప్పుడు పూర్తవుతాయి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa