సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025-26 సీజన్కు ముందు కావ్య మారన్ నేతృత్వంలోని సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది.ఈ జట్టుకు తొలి సీజన్ నుంచి నాయకత్వం వహించిన ఐడెన్ మార్క్రమ్ నాలుగో సీజన్ ప్రారంభానికి ముందే జట్టుతో బంధాన్ని ముగించాడు.ఇటీవల జరిగిన వేలంలో మార్క్రమ్ను రూ. 7 కోట్ల భారీ ధరకు డర్బన్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే సన్రైజర్స్ ఫ్రాంచైజీ అతన్ని తిరిగి తమ జట్టులోకి తెచ్చుకునే ఉద్దేశంతో రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించినా, డర్బన్ జట్టు భారీ బిడ్డింగ్కు వెనుకాడకపోవడంతో తాము తగ్గుకున్నట్టు తెలిపింది.
*నూతన కెప్టెన్గా ట్రిస్టన్ స్టబ్స్ ఈ క్రమంలో, సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు 25 ఏళ్ల యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ను తమ కొత్త కెప్టెన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ కోచ్ రస్సెల్ డొమింగో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన తెలిపిన ప్రకారం, యాజమాన్యానికి ఇప్పటికే ఈ ఎంపికపై అంగీకారం లభించింది.రాబోయే రెండు సీజన్ల పాటు స్టబ్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడని డొమింగో పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.
*సీనియర్ ప్లేయర్ల మధ్య స్టబ్స్ ఎంపికపై చర్చ జట్టులో క్వింటన్ డి కాక్, లూయిస్ గ్రెగొరీ, జానీ బెయిర్స్టో, మార్కో జాన్సన్ వంటి అనుభవజ్ఞులున్నా, యాజమాన్యం స్టబ్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అతను మొదటి సీజన్ నుంచే ఈ జట్టుతో కొనసాగుతున్నాడు.ఇప్పటివరకు ముగ్గురు సీజన్లలో 723 పరుగులు, 140.11 స్ట్రైక్రేట్తో స్టబ్స్ నిలకడగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం అతనిపై నమ్మకాన్ని ఉంచి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa