దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైన్యానికి అవసరమైన శీతాకాలపు సామాగ్రితో కూడిన తొలి గూడ్స్ రైలు కశ్మీర్ వరకు చేరింది. ఇది భారత రైల్వే చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది.ఆర్మీకి అవసరమైన వస్తువులు మోసుకొచ్చిన ఈ కార్గో రైలు అనంతరం కశ్మీర్లో రైతులు పండించిన ఆపిల్స్ తోపాటు ఢిల్లీకి బయలుదేరింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ అందుబాటులోకి రావడం వల్లే ఈ రవాణా సాధ్యమైందని భారత ఆర్మీ వెల్లడించింది.ఈ కార్గో రైలు మొత్తం 753 మెట్రిక్ టన్నుల శీతాకాలపు సామాగ్రితో అనంతనాగ్ వరకు చేరినట్లు తెలిపింది. ఈ ఘట్టాన్ని చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు.హిమాలయాల కఠిన భౌగోళిక పరిస్థితుల్లో, ఆర్మీతో పాటు సాధారణ ప్రజలకు ఈ రవాణా మార్గం ఎంతో ఉపయోగకరమని ఆర్మీ పేర్కొంది. భారీ మంచు, కొండచరియలు విరిగిన కారణంగా రహదారులు మూసుకుపోయిన వేళ, ట్రక్కుల్లో నిలిచిపోయిన ఆపిల్స్ కుళ్లిపోతుండగా, ఈ రైలు సురక్షితంగా ఆపిల్స్ను గమ్యస్థానాలకు చేర్చిందని వివరించింది.ఈ రవాణా మార్గం ద్వారా ఆర్మీకి సరుకు సరఫరా వేగవంతం కావడంతో పాటు, కశ్మీర్ ప్రాంతానికి సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కొత్త అవకాశాలు నెలకొంటాయని ఆర్మీ అభిప్రాయపడింది.ఇదిలా ఉండగా, అనంతనాగ్ రైల్వే స్టేషన్ వద్ద ఆర్మీకి అవసరమైన శీతాకాల సామాగ్రిని దిగుమతి చేసిన తర్వాత, బుద్గాం వద్ద ఆపిల్స్ను లోడ్ చేశారు. అనంతరం సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి గూడ్స్ రైలును ఢిల్లీకి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఆపిల్స్తో నిండి ఈ రైలు ఢిల్లీకి పయనమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa