ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో, ప్రముఖులు ఆయనతతో తమ అనుబంధాన్ని అందరితో పంచుకుంటున్నారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా మోదీతో తన మొదటి సమావేశం నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. మోదీ 2010లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారని, ఆ మాటలు తనకు ఎంతో గర్వకారణంగా నిలిచాయని జడేజా తెలిపాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నాడు. ఈ సంఘటన తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు.2010లో అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్కు ముందు ఈ ఘటన చోటుచేసుకుందని జడేజా వివరించాడు. “నేను మోదీ గారిని మొదటిసారి 2010లో కలిశాను. అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకునేందుకు ఆయన మైదానంలోకి వచ్చారు. అందరితో కరచాలనం చేస్తూ వస్తున్నప్పుడు అప్పటి మా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నన్ను ఆయనకు పరిచయం చేశాడు” అని తెలిపాడు.“అప్పుడు మోదీ గారు నవ్వి, ధోనీ వైపు చూస్తూ ‘ఇతడిని జాగ్రత్తగా చూసుకో మావాడే అని అన్నారు. ఆయన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, జట్టు సభ్యులందరి ముందు అలా అనడం నాకు మాటల్లో చెప్పలేనంత గర్వంగా, సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి పట్ల ఆయన చూపించే ఆత్మీయతకు, వ్యక్తిగత శ్రద్ధకు ఇది నిదర్శనం. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని జడేజా తన వీడియోలో పేర్కొన్నాడు. ఈ చిన్న సంఘటన తనలో ఎంతో స్ఫూర్తిని నింపిందని అన్నాడు.ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ ఆటగాడిగా కొనసాగుతున్న 36 ఏళ్ల జడేజా, ఇటీవలే ముగిసిన పలు కీలక టోర్నీలలో అద్భుతంగా రాణించాడు. జూన్-జూలైలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలతో కలిపి 516 పరుగులు సాధించి, సిరీస్లో నాలుగో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. బౌలింగ్లోనూ ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ జడేజా కీలక సభ్యుడు. గత ఏడాది బార్బడోస్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa