ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో రాజ్యాంగపరమైన పాలన కరువైంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 04:30 PM

రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగ‌బ‌ద్ధంగా పాల‌న జ‌ర‌గ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ఆక్షేపించారు. పాలన అందరికీ అందాలి, సంపద అందరికీ అందాల‌నే ఉద్దేశంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఐదేళ్లు ప‌రిపాలించార‌ని చెప్పారు. లక్ష కోట్లు ఒక రాజధానికి పెడితే మిగిలిన ప్రజలు ఏం కావాలి, మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు ఆ లక్ష కోట్లు అప్పు తీర్చే పనిలో ఉండాలా ? అంటూ ప్ర‌శ్నించారు. రాజ్యాంగంలో ఇది చెప్పలేద‌ని త‌ప్పుప‌ట్టారు. బుధ‌వారం శ్రీ‌కాకుళం జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ..నాయకుడికి ప్రత్యేక బాధ్యత ఉంటుంద‌ని, మీ అందరూ నాయకులుగా ఎదగాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీలో క‌ష్ట‌ప‌డే ప్ర‌తి ఒక్క‌రికీ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని చెప్పారు. క‌ష్ట‌ప‌డేతత్వం, చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తే అవ‌కాశాలు త‌ప్ప‌క వ‌స్తాయ‌న్నారు.  మీ అందరి బలంతో  వైయ‌స్ఆర్‌సీపీ తిరుగులేని  శ‌క్తిగా మారుతుంద‌ని, పార్టీలో ఆయా బాధ్యత తీసుకున్న వారు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌న్నారు.  ప్రతి పక్షంలో ఉన్నాడే సంపూర్ణ నాయకుడుగా ఎదిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa