కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్టు, దేశంలో నవరాత్రుల ప్రారంభం నుంచే జీఎస్టీ 2.0 కొత్త విధానం అమలులోకి రానుంది. విశాఖపట్నంలో నిర్వహించిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ 2.0 అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఈ విషయం వెల్లడించారు. ఆధునికీకరణ వైపు కీలకమైన ఈ మార్పులు, జీఎస్టీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజలకి అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
జీఎస్టీ 2.0 అమలులోకి రావడానికి ముందే ఆటో మొబైల్ రంగం రాయితీలు, ఆఫర్లు ప్రకటించడం మొదలైందని మంత్రి తెలిపారు. దీని ద్వారా మార్కెట్లో వ్యాపార ఉత్సాహం పెరుగుతుందని, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాపార వర్గాల్లో ఈ కొత్త విధానం పట్ల ఆసక్తి నెలకొనడం విశేషమని పేర్కొన్నారు.
జీవనోపాధికి అవసరమైన పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువులను ఇప్పటివరకు ఉన్న 5 శాతం జీఎస్టీ శ్లాబ్ నుంచి పూర్తిగా మినహాయిస్తూ — 0 శాతం శ్లాబ్కు మార్చామని మంత్రి నిర్మలా తెలిపారు. దీనివల్ల సాధారణ ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతికి ఉలికిపాటులు తగ్గుతాయని, దీన్ని బట్టి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల చూపిస్తున్న నిబద్ధత అర్థమవుతుందని చెప్పారు.
జీఎస్టీ 2.0 ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో పటిష్టత పెరగడంతోపాటు, ట్యాక్స్ పాలసీలో సరళీకరణ కుదిరే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం, డిజిటల్ పద్ధతుల ఆధారంగా మరింత వేగవంతమైన, నిష్పక్షపాత పన్ను పరిపాలనను తీసుకురానుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa