ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కోసం త్వరలోనే ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను తీసుకురానున్నట్లు ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ మన జీవితాల్లో భాగమైపోయిందని, దీనికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతోందని, మైక్రో, నానో రూపాల్లో ఇది పశువుల కడుపులోకి, చివరికి పసికందుల రక్తంలోకి కూడా చేరుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రెండు, మూడు నెలల్లో ఒక సమగ్ర కార్యాచరణతో ముందుకొస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa