ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో మొత్తం 13 అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అమరావతిలో 343 ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చాలనే డ్రాఫ్ట్ బిల్లులో సవరణలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో 13 బిల్లులకు మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి వివిధ చట్టాలను సవరించాలనే ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అమరావతి పరిధిలో 343 ఎకరాల భూమిని సేకరించేందుకు గతంలో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా ఓటర్ల జాబితా తయారీ కోసం మరో మూడు తేదీలు ఖరారు చేయాలని మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు సభలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, ఏపీ సీఆర్డీఏ, అమరావతి రాజధాని ఏరియా మినహాయించి మిగతా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు అమరావతిలో కీలక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుచేస్తూ ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. లిఫ్ట్ పాలసీ కింద చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయింపుపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగింది.
మరోవైపు వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేవుని గడపగా పేరొందిన కడప జిల్లా పేరులో కడప కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ బిల్లులో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సభలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, ఏపీ సీఆర్డీఏ, అమరావతి రాజధాని ఏరియా మినహాయించి మిగతా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు అమరావతిలో కీలక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుచేస్తూ ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. లిఫ్ట్ పాలసీ కింద చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయింపుపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగింది.
మరోవైపు వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేవుని గడపగా పేరొందిన కడప జిల్లా పేరులో కడప కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ బిల్లులో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa