ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు బయటపడిన ప్రతి సందర్బంలోనూ సీఎం చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్ను బయటకు తీస్తుంటారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని సోమాజీగూడా ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, డైవర్షన్లో భాగంగా అనిల్రెడ్డి కంపెనీల్లో లిక్కర్ స్కాంలో సిట్ సోదాలు అంటూ హంగామాను ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఒకవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, మరోవైపు కనీసం యూరియాను సైతం అందించలేని చేతకానితనం, తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో అవినీతి దందాలతో ప్రభుత్వ ప్రతిష్ట అథాపాతాళానికి పడిపోయిందని అన్నారు. తన అసమర్థపాలనను కప్పిపుచ్చుకుంటూ, వైయస్ఆర్సీపీపై బుదరచల్లేందుకు ఎల్లో మీడియా సహకారంతో తమకు అలవాటైన కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa