అసెంబ్లీకి హాజరు కాకుండా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఆదివారం అమరావతిలో యనమల రామకృష్ణుడు విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. అసెంబ్లీని బహిష్కరిస్తామనడం ముమ్మాటికి అనర్హత పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. అనర్హత వేయడంతోపాటు తదుపరి ఎన్నికల్లో ఇలాంటి వారు పోటీ చేయవచ్చో? లేదో? అనే విషయం సైతం న్యాయస్థానం తేల్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాకుంటే.. వారిపై అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ నిబంధన వైఎస్ జగన్తోపాటు ఆయన ఎమ్మెల్యేలకు అర్థం కాకుంటే.. వాళ్ల న్యాయమూర్తిని అడిగి తెలుసుకోవాలంటూ సూచించారు. ఇక అనర్హత వేటు నిబంధన ఏమిటంటూ వైఎస్ జగన్ అడగటం హాస్యాస్పదంగా ఉందని యనమల రామకృష్ణుడు వ్యంగ్యంగా అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) చదివితే.. నిబంధనలు అర్థమవుతాయంటూ వైఎస్ జగన్కు యనమల రామకృష్ణుడు సూచించారు. రాజ్యాంగ నిబంధనలు చదువుకుని.. వాటి సారాంశం అర్థం చేసుకుంటే.. ఈ తరహా సందేహాలు రావంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్కు యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa