బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల పరంపర కొనసాగుతోంది. దేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే దుర్గా పూజకు కొద్ది రోజుల ముందు, ఓ ఆలయంలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. జమాల్పూర్ జిల్లాలోని సరిశబరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తార్యాపారా ఆలయంలో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం కుష్టియా జిల్లాలోని మీర్పూర్ ఉపజిల్లాలో ఉన్న శ్రీ శ్రీ రక్కా కాళీ ఆలయంలోని కార్తీక, సరస్వతి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయం చూసి ఈ దాడికి పాల్పడ్డారని ఆలయ కమిటీ అధ్యక్షుడు అమరేష్ ఘోష్ తెలిపారు. "పండుగ ముందు ఇలా జరగడంతో మేమంతా భయాందోళనకు గురవుతున్నాం" అని ఆలయ కమిటీ మాజీ కార్యదర్శి బాదల్ కుమార్ దే ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa