దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తన అభిమానులకు అనూహ్యరీతిలో శుభవార్త అందించాడు. గత ఏడాది వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికిన అతను, ఇప్పుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ జట్టులోకి అడుగుపెట్టాడు. త్వరలో జరగనున్న పాకిస్థాన్ పర్యటన కోసం ప్రకటించిన వన్డే, టీ20 జట్లలోనూ డికాక్కు చోటు దక్కింది.2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం డికాక్ 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతను కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, 2027లో తమ స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని అతను తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ టూర్కు ముందు నమీబియాతో జరిగే ఏకైక టీ20 మ్యాచ్లో కూడా డికాక్ ఆడనున్నాడు.డికాక్ పునరాగమనంపై దక్షిణాఫ్రికా కోచ్ కాన్రాడ్ హర్షం వ్యక్తం చేశారు. "క్వింటన్ మళ్లీ వైట్-బాల్ క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం మాకు చాలా పెద్ద బూస్ట్. అతని భవిష్యత్ ప్రణాళికల గురించి గత నెలలో మేం చర్చించాం. దేశం తరఫున ఆడాలనే బలమైన ఆకాంక్ష అతనిలో ఇంకా ఉందని అప్పుడే స్పష్టమైంది. అతని నైపుణ్యం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అని కాన్రాడ్ వివరించారు.నిజానికి, రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనే డికాక్ భవిష్యత్తులో తిరిగి వచ్చే అవకాశం ఉందనే పరోక్ష సంకేతాలిచ్చాడు. "ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. కానీ జీవితంలో విచిత్రమైనవి జరుగుతుంటాయి. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు" అని అతను అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అదే నిజమైంది. అతని రాకతో 2026 టీ20 ప్రపంచకప్, 2027 వన్డే ప్రపంచకప్లకు దక్షిణాఫ్రికా జట్టు మరింత పటిష్టంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa