ఆసియా కప్ 2025 సూపర్-4 దశలో భారత్ మరోసారి తన దూకుడు ముద్ర వేసింది. ఆదివారం రాత్రి పాకిస్థాన్తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మలు బ్యాట్తో మెరిశారు. అయితే మ్యాచ్ అనంతరం పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఔట్పై వివాదం చెలరేగింది.
ఇన్నింగ్స్ 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తుండగా, ఫకర్ జమాన్ వేసిన షాట్కు వికెట్ కీపర్ సంజు శాంసన్ క్యాచ్ పట్టాడు. ఫీల్డ్ అంపైర్ సానుకూలంగా స్పందించకుండా, విషయాన్ని థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ మల్టిపుల్ యాంగిల్స్లో రీప్లేను పరిశీలించి, ఔట్గా ప్రకటించాడు.
అయితే రీప్లేలో బంతి సంజు శాంసన్ వేళ్లకు తగలిన అనంతరం నేలపై తాకినట్టు పాకిస్థాన్ మాజీలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇది పెద్ద చర్చకు దారి తీసింది. పాక్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు.
ఈ వివాదం నేపథ్యంలో థర్డ్ అంపైర్ నిర్ణయం, అంతర్జాతీయ క్రికెట్లో టెక్నాలజీ మీద విశ్వసనీయతపై చర్చ మొదలైంది. మ్యాచ్లో భారత్ విజయాన్ని సాధించినప్పటికీ, ఈ ఓటమి పాక్ శిబిరంలో అసంతృప్తిని కలిగించింది. ఫకర్ ఔట్ వివాదం ఆసియా కప్లో నూతన వివాదానికి నాంది పలికినట్టయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa