ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యాటకులని అధికంగా ఆకర్షిస్తున్న జర్మనీ

international |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 09:17 PM

యూరప్‌లో విహారయాత్రలకు వెళ్లే భారతీయులకు జర్మనీ అత్యంత ఇష్టమైన దేశంగా మారుతోంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే భారత పర్యాటకులు జర్మనీలో 5,20,000 మంది బస చేశారని జర్మన్ నేషనల్ టూరిస్ట్ ఆఫీస్ (జీఎన్‌టీవో, ఇండియా) మంగళవారం వెల్లడించింది. ఈ గణాంకాలతో యూరప్‌లో భారతీయులు ఎక్కువగా సందర్శించే టాప్-3 దేశాల్లో ఒకటిగా జర్మనీ నిలిచింది.గతేడాది (2024) ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-జూలై మధ్య జర్మనీకి వచ్చే భారత పర్యాటకుల సంఖ్య 5.5 శాతం పెరిగింది. ముఖ్యంగా భారత్-జర్మనీ మధ్య విమాన సర్వీసులు గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019తో పోలిస్తే 2024 నాటికి ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు 26 శాతం అధికమయ్యాయి. మెరుగైన కనెక్టివిటీతో పాటు, ఆధునిక భారత పర్యాటకులను ఆకట్టుకునేలా రూపొందించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా సత్ఫలితాలనిచ్చాయని జీఎన్‌టీవో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa