బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అమెరికా హెచ్-1బీ వీసా రుసుము పెంపుదల ప్రభావం కూడా దీనిపై కనిపిస్తోంది. రూపాయి విలువ మరింత దిగజారడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 2,700 పెరిగి రూ. 1,18,900కు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి గత మార్కెట్ సెషన్లో పది గ్రాములకు రూ. 1,16,200 వద్ద ముగిసింది.అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వల్లనే బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 39,950 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 బంగారం ధర రూ. 78,950 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కిలో వెండి రూ. 3,220 పెరిగి రూ. 1,39,600కు చేరి, సరికొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో వెండి ధర ఏకంగా రూ.49,900 పెరిగింది. డిసెంబర్ 31న వెండి ధర రూ. 89,700గా ఉంది. మరోవైపు, డాలర్ మారకంతో రూపాయి మంగళవారం 47 పైసలు క్షీణించి 88.75కు పడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa