ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజయపథం కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ గెలుపొందిన భారత్ ఇంకా ఓటమి రుచి చూడకుండానే ఫైనల్కు అర్హత సాధించింది.బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 25 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్ బెర్త్ను ముందుగానే ఖరారు చేసుకుంది. మరోవైపు శ్రీలంక టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించగా, బంగ్లాదేశ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. గురువారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో బంగ్లా గెలిస్తేనే ఫైనల్కి వెళ్తుంది. లేకపోతే పాక్కి అవకాశాలు లభిస్తాయి.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (38), శుభ్మన్ గిల్ (29) కూడా కీలక భాగస్వామ్యాలు అందించారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫుద్దిన్ తలో వికెట్ తీశారు.జవాబుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ విఫలమై 130 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సైఫ్ హసన్ 51 బంతుల్లో 69 పరుగులతో ఒంటరిగా పోరాడినా ప్రయోజనం లేకుండాపోయింది. పర్వేజ్ హోస్సేన్ (21) మినహా ఇతరులంతా డబుల్ డిజిట్కే వెళ్లలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి మెరిశాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీసారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ తలో వికెట్ సాధించారు.ఫీల్డింగ్ పరంగా టీమిండియాకు మరింత మెరుగుదల అవసరమని స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్లో ఐదు క్యాచ్లు డ్రాప్ కావడమే కాదు, వాటిలో నాలుగు సైఫ్ హసన్కు చెల్లిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa