ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి పరిపాలన కొనసాగిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 06:27 PM

చంద్ర‌బాబు రాష్ట్ర ప‌గ్గాల‌ను త‌న కొడుకు నారా లోకేష్ చేతిలో పెట్టి న‌డిపిస్తున్నాడ‌ని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమ‌ర్శించారు. ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి బాధపడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తుంద‌న్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగుతుంద‌ని త‌ప్పుప‌ట్టారు. లేని లిక్కర్ కేసులు పెట్టి మా నాయకుల్ని అరెస్టు చేశారని ఆక్షేపించారు. సాధారణంగా కొండను తవ్వి ఎలుకను పట్టారు అంటార‌ని,  ఈ కేసులో ఎలుక కూడా లేద‌ని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరగలేద‌ని,  మద్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అంతులేని అవినీతి, అక్రమాలు జ‌రుగుతున్నాయని ధ్వ‌జ‌మెత్తారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చాలా తక్కువ ఆదాయం వస్తుంద‌ని గుర్తు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిందని, కూట‌మి పాల‌న‌లో వ్యవసాయం, ఆరోగ్యం..ఇలా ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి కనిపించడం లేద‌న్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నార‌ని` మేరుగు నాగార్జున‌ ఫైర్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa