ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్‌కు పది రోజుల్లో ప్రభుత్వ నివాసం.. కోర్టుకు తెలిపిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 06:33 PM

ఆప్‌ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌కు పది రోజుల్లోగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. 2024 అక్టోబర్‌లో సీఎం పదవి నుంచి వైదొలిగిన కేజ్రీవాల్ ప్రస్తుతం మండి హౌస్ సమీపంలో ఉంటున్నారు. లోధి ఎస్టేట్‌లోని మాయావతి పూర్వ నివాసం కేటాయించాలని ఆప్‌ డిమాండ్‌ చేయగా, ఆ బంగ్లా ఇప్పటికే ఒక సహాయ మంత్రికి కేటాయించబడిందని కేంద్రం తెలిపింది. కేజ్రీవాల్‌కు టైప్‌ 7 లేదా టైప్‌ 8 బంగ్లా అర్హత ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa