ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిభద్రతలని కాపాడంలో ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 02:21 PM

రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘వైసీపీ హయాంలో శాంతిభద్రతలు లేవు. మద్యం ధరల భయంతో యువత గంజాయి వైపు మొగ్గుచూపింది. సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు. గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఇప్పటివరకు 40 వేలకు పైగా ఈగల్‌ క్లబ్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. జాతీయ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో నేరాలు 60 శాతం మేరకు తగ్గాయని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చామన్నారు. అలాగే న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయని చెప్పారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్నారని, వారి ఉన్మాదం రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు అడ్డంకిగా మారిందని అనిత మండిపడ్డారు. ఆర్థిక నేరాలు, డిజిటల్‌ నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa