ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభాపతికి ప్రోటోకాల్ పాటించరా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 02:34 PM

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్ మోషేన్ రాజుకు అవమానం జరిగిందంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. "సభాపతికి ప్రోటోకాల్ పాటించారా?" అంటూ ప్రశ్నించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మండలిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఉదయం మండలి సమావేశాలు ప్రారంభం కాకముందు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. చట్టసభలను, రాజ్యాంగబద్ధమైన పదవులను గౌరవించాలని తాము కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. మండలి చైర్మన్‌కు జరిగిన అవమానంపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వ్యక్తిగత అంశం కాదని, రాజ్యాంగంతో ముడిపడిన విషయమని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa